Wednesday, November 19, 2014

మేతి ఇడ్లీ


కావల్సిన పదార్థాలు: బియ్యం: 1cup కొబ్బరి తురుము: 1cup మెంతులు: 1tbsp పెరుగు: 4tbsp బెల్లం: 3tbsp ఉప్పు: రుచికి సరిపడా 


తయారుచేయు విధానం: 1. ముందుగా ఒక గిన్నెలో బియ్యం వేసి శుభ్రంగా కడిగి నీళ్ళు పోసి 6గంటల పాటు నానబెట్టుకోవాలి. బియ్యాన్ని రాత్రిల్లో నానబెట్టుకొంటే మరింత మంచిది. తర్వాత రోజు పిండి మొత్తగా రుబ్బుకోవడానికి సులభం అవుతుంది.
 2. మరో గిన్నె తీసుకొని అందులో కొద్దిగా పెరుగులో మెంతులను వేసి స్పూన్ తో బాగా మిక్స్ చేసి బియ్యం లాగే వీటిని కూడా రాత్రంత నానబెట్టుకోవలి. కనీసం 6 గంటల సేపు నానాలి. 
3. బియ్యం, మెంతులు నానిన తర్వాత మిక్సీ జార్ లో మెంతులను వేసి పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మొంతి పేస్ట్ ను తీసి పక్కన పెట్టుకోవాలి.
 4. ఇప్పుడు అదే జార్ లో బియ్యం వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. బియ్యం గ్రైండ్ చేస్తుండగానే అందులో కొబ్బరి తురుము వేసి, స్పూన్ తో బాగా మిక్స్ చేయాలి. 
5. తర్వాత అందులో బెల్లం కూడా వేయాలి. 
6. మొత్తం మిశ్రమాన్ని గరిటతో బాగా మిక్స్ చేయాలి. ఇలా పిండి తయారుచేసుకొన్నాక, రుబ్బుకొన్ని పిండిని రాత్రంతా అలాగే ఉడనివ్వాలి.
 7. తర్వాత రోజు ఉదయం, ఇడ్లీపిండిలో, మేంతి పేస్ట్, ఉప్ప వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత ఇడ్లీ ప్లేట్స్ లో పిండిని పోయాలి.
 8. ఇడ్లీ కుక్కర్ ను స్టౌ మీద పెట్టి మీడియం మంట మీద, ఆవిరి మీద ఇడ్లీలను 10నిముషాలు ఉడికించుకోవాలి . స్టీమర్ నుండి ఆవిరి ఒత్తిడి భయటకు వచ్చినప్పుడు, ఇడ్లీ కుక్కర్ మూత తీసి, స్పూన్ సహాయంతో ఇడ్లీలను సర్వింగ్ బౌల్లోనికి తీసుకోవాలి. అంతే తినడానికి మేతి ఇడ్లీ రెడీ.ఈ ఇడ్లీని కొబ్బరి చట్నీ లేదా గార్లిక్ చట్నీతో సర్వ్ చేయాలి .

No comments:

Post a Comment