పచ్చి చింత కాయలు – 4 కిలోలు(బాగా కండపట్టి ఉన్నవి, పులుపు ఉన్నవి)
ఉప్పు – 4 కిలో(గడ్డ ఉప్పు లేదా సముద్రపు ఉప్పు లేదా కళ్ళు ఉప్పు)
పసుపు – 50 గ్రాములు
మెంతులు – 50 గ్రాములు
ఆముదం – 1 గరిటె
1.చింతకాయల్ని కడిగి, ఆరబోసి, బాగా ఆరాక తొడాలు ఈనెలు తీసుకోవాలి.
2.రోట్లో కొంచెంకొంచెంగా చింత కాయలు, ఉప్పు,పసుపు,మెంతులు వేసి కచ్చాపచ్చాగా తొక్కి ఇలా కచ్చాపచ్చాగా తొక్కిన పచ్చడిని(కొంతమంది తిరగతొక్కేప్పుడే పచ్చట్లో రెండుగెంటెలు ఆముదంపోసి తొక్కుతారు.) ఆముదం కలిపి జాడీలోకి తీసుకుని పది రోజులు ఊరనివ్వాలి.
3.మొదటిసారి మెత్తగా తొక్కటానికి అవ్వదు కాబట్టి పది రోజుల తర్వాత ఈ ఊరిన పచ్చడిని తీసి మళ్ళా రోట్లోవేసి మెత్తగా అయ్యేవరకు తొక్కాలి(తిరగతొక్కలి).
4.చింతకాయల్లో పీచు చూసి వేరేసుకోని ఇలా మెత్తగా తొక్కుకున్న ముడి చింతకాయపచ్చడిని జాడీలో ఎత్తి పెట్టుకోవాలి.
చింతకాయ ముడి పచ్చడి పచ్చడి రెండేళ్ళైనా అలానే ఉంటుంది.
No comments:
Post a Comment