రంజాన్ స్పెషల్ షీర్ ఖుర్మా కావలసినవి:
సేమ్యా - 100 గ్రా.
నెయ్యి/నూనె- టేబుల్ స్పూన్
పాలు - 3 లీటర్లు
పంచదార - 250 గ్రా.
బియ్యప్పిండి - 12 టేబుల్ స్పూన్లు
ఏలకుల పొడి - చిటికెడు
పాలపొడి - కప్పు
ఎండు ఖర్జూరం - 100 గ్రా. (కొన్ని నీళ్లు పోసి, రాత్రిపూట నానబెట్టి, మరుసటి రోజు సన్నగా తరగాలి)
బాదంపప్పు - 50 గ్రా.
కిస్మిస్ - 50 గ్రా.
పిస్తాపప్పు - 50 గ్రా.
పచ్చికొబ్బరిముక్కలు - 50 గ్రా.
కెవ్రా (మార్కెట్లో లభిస్తుంది) - టీ స్పూన్
రంజాన్ స్పెషల్ షీర్ ఖుర్మా తయారి:
ఒక పెద్ద గిన్నెను స్టౌ మీద పెట్టి, నెయ్యి వేసి వేడి చేయాలి. అందులో సేమ్యా వేసి సన్నని మంట మీద ముదురు గోధుమ వర్ణం వచ్చేవరకు వేయించాలి. గిన్నెలో నుంచి సేమ్యాని మరొక పాత్రలోకి తీసుకోవాలి. సేమ్యా వేయించిన గిన్నెలోనే పాలు పోసి మరిగించాలి. బియ్యప్పిండిలో కొద్దిగా చల్లని పాలు కలిపిన మిశ్రమాన్ని, పంచదార, ఏలకుల పొడి... వీటిని మరుగుతున్న పాలలో పోసి కలిపి, సన్నని మంట మీద ఉడికించాలి. అందులో తరిగిన ఖర్జూరం, బాదంపప్పు, కిస్మిస్, పిస్తాపప్పు, కొబ్బరి ముక్కలు వేసి కలపాలి. సేమ్యా వేసి ఉండలు కట్టకుండా కలుపుతూ ఐదు నిమిషాలు ఉంచి, తీయాలి.
No comments:
Post a Comment