కుడుములు
కావలసిన వస్తువులు:
బియ్యం పిండి - ఒక కప్పు
కొబ్బరి ముక్కలు - పావు కప్పు
బెల్లం - ముప్పావు కప్పు
నీళ్ళు - రెండు కప్పులు
నూనె - ఒక స్పూన్
ఏలకుల పొడి - పావు స్పూన్
తయారు చేసే విధానం:
బియ్యప్పిండిలో ఒక కప్పు నీళ్ళు పోసి కలపాలి. బెల్లంలో ఒక కప్పు నీళ్ళు పోసి కరిగించి
వడకట్టాలి. నాన్ స్టిక్ పాన్ లో కరిగించిన బెల్లం వేసి మరిగించాలి. ఇప్పుడు బియ్యం పిండి,
కొబ్బరి ముక్కలను, ఏలకుల పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న మంటపై
కొంచెం గట్టి పడేవరకు ఉడికించుకోవాలి. చల్లారిన తర్వాత నిమ్మకాయంత సైజు ఉండలుగా
చేసుకోవాలి. వీటిని ఇడ్లీ ప్లేట్ కి కొంచెం నూనె రాసి అందులో పెట్టి 5 నుంచి 10 నిమిషాల
వరకు ఆవిరి మీద ఉడికించి దించుకోవాలి.
No comments:
Post a Comment