మిల్క్ మైసూర్ పాక్
కావలసిన వస్తువులు:
చక్కెర - 1 కిలో.
నెయ్యి - 1 కిలో.
మిల్క్పౌడర్ (అమూల్) - 250 గ్రాములు.
మైదా - 250 గ్రాములు.
యాలుకల పొడి - 1 టీ స్పూను.
నీళ్లు - అర లీటరు.
తయారు చేసే విధానం:
మిల్క్ పౌడర్లో 150 గ్రాముల నెయ్యి వేసి మిశ్రమాన్ని కలిపి ఉంచుకోవాలి. వేరొక గిన్నెలో పంచదార, నీళ్లు కలిపి తీసుకుని సన్నని సెగపై తీగపాకం పట్టి మిల్క్ పౌడర్ ముద్ద, మైదా వరుసగా వేసి కలపాలి. వేరొక గిన్నెలో మిగిలిన నెయ్యి వేడి చేసి పంచదార, మిల్క్ పౌడర్ మిశ్రమంలో వేసి బాగా కలిపి ట్రేలో వేసి ఆరు గంటల పాటు ఆరబెట్టి కావలసిన సైజులో ముక్కలు చేసుకోవాలి.
No comments:
Post a Comment