పప్పులో ఉండ్రాళ్ళు
కావలసిన పదార్థములు:
బియ్యం పిండి - ఒక కప్పు
నీళ్ళు - తగినన్ని
పప్పు కోసం పెసరపప్పు - ఒక కప్పు
నీళ్ళు సరిపడినన్ని
బెల్లం - అర కప్పు
యాలకుల పొడి - అర చెంచా
తయారు చేయు విధానం :
బియ్యం పిండిలో నీళ్ళుపోసి గట్టి పిండి తయారు చేసుకుని, దీన్ని చిన్న చిన్న ఉండలుగా
చేసుకోవాలి. ఈ ఉండలను మరుగుతున్న నీళ్ళల్లో వేసి ఉడికించాలి. ఉడికిన ఉండలను
తీసి పక్కన పెట్టుకోవాలి. పెసరపప్పు లో తగినన్ని నీళ్ళు పోసి ఉడికించుకోవాలి. ఉడికిన
పెసర పప్పులో బెల్లం పొడిగొట్టి వేసుకోవాలి. పప్పు స్టౌ మీద ఉండగానే ఉడికిన ఉండలను
వేసి రెండు నిమిషాలు ఉడకనిచ్చి యాలకుల పొడి వేసి స్టౌ మీద నుంచి దించాలి.
No comments:
Post a Comment