Sunday, June 29, 2014

పాల ఉండ్రాళ్ళు

పాల ఉండ్రాళ్ళు 
కావాల్సినపదార్థాలు: 
బియ్యం పిండి - ఒక కప్పు
చక్కెర - ఒక కప్పు
పాలు - ఒక కప్పు
ఏలకుల పొడి - పావు టీ స్పూన్
నీళ్ళు - 1 1/2 కప్పులు
తురిమిన పచ్చి కొబ్బరి - ఒక కప్పు
వేయించి పొడి కొట్టిన తెల్ల నువ్వుల పొడి - అరకప్పు
తయారుచేయువిధానం:
రెండు కప్పుల నీటిని గిన్నెలో పోసి బాగా మరగనివ్వాలి. బియ్యప్పిండిని వేసి, బాగా
కలియదిప్పి, వెంటనే గిన్నెపై మూత పెట్టాలి. సన్నని సెగమీద 4 -5 నిముషాల పాటు
ఉడకనివ్వాలి. విడిగా గిన్నెలోకి తీసి చల్లారనివ్వాలి. చిన్న ఉండలు చేసి ప్లేటులో విడిగా
పెట్టుకోవాలి. మరొక గిన్నెలో చక్కెర వేసి, నీటిని పోసి మరిగించాలి. సెగ తగ్గించి,
కొబ్బరితురుము వేసి కొద్ది సేపు కలపాలి. బియ్యప్పిండి ఉండలను కుడా వేసి బాగా
కలియ దిప్పాలి. రెండు నిముషాల తరువాత కప్పు పాలను పోసి, ఉండలను అందులో వేసి
5 నిముషాల సేపు ఉడకనివ్వాలి. మెత్తగా నూరిన నువ్వల పొడి, ఏలకుల పొడి వేసి
కలపాలి. స్టవ్ మీద నుండి దించి చల్లార నివ్వాలి.

No comments:

Post a Comment