Sunday, June 29, 2014

కేసరి పూర్ణాలు

కేసరి పూర్ణాలు
కావాల్సినపదార్థాలు: 
బొంబాయి రవ్వ - అరకిలో
పంచదార - అరకిలో
నెయ్యి - 100గ్రాములు
మైదా - పావుకిలో
నూనె - పావుకిలో
ఏలకులు -6
బెల్లం - 50గ్రాములు
తయారుచేయువిధానం: 
బొంబాయి రవ్వ దోరగా ఏపుకోవాలి. మందపాటి గిన్నెలో రవ్వ ఒకటికి రెండు చొప్పున
నీళ్ళు పోయాలి. నీరు మరుగుతున్నప్పుడు పంచదార, ఏలకుల పొడి వేసి కలపాలి. నీళ్ళు
రెండు పొంగులు రానిచ్చి బొంబాయి రవ్వ ఉండలు కట్టకుండా కలుపుతూ పోయాలి.
సన్నని సెగపై ఉంచి ఉడికించాలి. ఉడికిన తర్వాత దింపి చల్లారనిచ్చి చిన్న చిన్న ఉండలు
చేసి పళ్ళెములో వేయాలి. మైదా పిండిలో కొద్దిగా తినే సోడా వేసి కొద్దిగా బెల్లం తరిగి వేసి
నీళ్ళు పోసి బజ్జీల పిండివలె కలపాలి. పిండిలో కొంచెం ఉప్పు వేస్తే రుచిగా ఉంటుంది.
బాండీలో నూనె వేసి కాగానిచ్చి ఒక్కొక్క ఉండని కలిపిన పిండిలో ముంచి నూనెలో
వేయాలి. చక్కగా వేగిన తర్వాత తీసి మరొక వాయి వేయాలి. ఇవి రెండు, మూడు రోజుల
వరకు ఉంటాయి. శెనగపప్పు పూర్ణాలకంటే తేలికగా తయారు చేసుకోవచ్చు.

No comments:

Post a Comment