Thursday, June 12, 2014

కాంచీపురం ఇడ్లీ

కాంచీపురం ఇడ్లీ

కావాల్సినవి:
-------------
బియ్యం - 1కప్పు
మినపప్పు - 1/2కప్పు
అల్లం - చిన్న ముక్క
జీలకర్ర - 1/2స్పూన్
మిరియాలు - అరడజను
ఇంగువ - చిటికెడు
ఆవాలు - 1/2స్పూన్
ఉప్పు - తగినంత, నూనె - 1 స్పూన్
కరివేపాకు - కొంచెం
తయారీ విధానం:
---------------------
ముందుగా బియ్యాన్ని సుమారు ఎనిమిది గంటల పాటు నీళ్లలో నానపెట్టాలి. అలాగే మినపప్పును కూడా. అల్లంను చాలా చిన్న చిన్న ముక్కలుగా తరిగి వుంచాలి. మిరియాలను చితక్కొట్టి పక్కన వుంచాలి. ఆపై బియ్యం, మినపప్పు విడివిడిగా మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బిన తరువాత రెండింటినీ బాగా కలపాలి. ఆ మిశ్రమంలో ఉప్పు వేసి ఒక పూట అలా వదిలేయాలి. నానిన ఆ పిండికి అల్లం, జీలకర్ర, ఇంగువ, దంచిన మిరియాలు కలపాలి. పాన్‌లో నూనె వేసి, కాస్త కాగాక, ఆవాలు, కరివేపాకు వేసి, ఒక్క నిమషం ఆగి, ఆ పోపును తీసి పిండిలో వేయాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకు నూనె లేదా నెయ్యి రాసి, ఈ పిండి మిశ్రమాన్ని వేసి, ఆవిరిపై ఉడికించాలి.

No comments:

Post a Comment