Wednesday, June 18, 2014

చెక్కలు



చెక్కలు
కావాల్సిన పదార్థాలు:
వరిపిండి - మూడున్నర కిలోలు,
మైదాపిండి - అర కిలో,
పెసరపప్పు - 100 గ్రాములు,
జీలకర్ర - 100 గ్రాములు,
పచ్చిమిర్చి - కిలోన్నర,
నూనె - 150 గ్రాములు,
ఉప్పు - తగినంత,
నీళ్లు - తగినన్ని,
నూనె - నాలుగు కిలోలు.

తయారుచేయు విధానం:
ముందుగా పచ్చిమిర్చిని ముద్దగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత నీటిని మరగపెట్టుకుని అందులో మందుతీసుకున్న వరిపిండి, మైదా, పెసరపప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి ముద్ద, 150 గ్రాముల నూనె, తగినంత ఉప్పు వేసుకుని పిండిని ఉక్కపెట్టుకోవాలి. ఇలా ఉక్కబెట్టుకున్న పిండిని చిన్న చిన్న గోళీలుగా చేసుకుని అట్లకాడ తీసుకుని దీనిని చిన్న చిన్న అప్పాలుగా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టౌ మీద వెడల్పాటి మూకుడు పెట్టి సరిపడా నూనె పోసి మరగబెట్టాలి. ఒత్తుకున్న అప్పాలను నూనెలో వేసి ఎరుపురంగు వచ్చేవరకూ వేయించాలి.

No comments:

Post a Comment