Monday, September 8, 2014

కుండీలు, మడుల్లో సులువుగానే ఇంటిపంటలు సాగు

కంపోస్టు+కొబ్బరిపొట్టు+మట్టి,,
 ఒకటి లేదా రెండు కుండీలతో ఆకుకూరల సాగు సరదాగా మొదలు పెట్టొచ్చు. ఆకుకూరలకు ఆరు అంగుళాల కన్నా లోతు మట్టి అవసరం లేదు. కుండీలు/ ట్రేలు/ మడుల్లో ఆకుకూరలను ఎంచక్కా పెంచుకోవచ్చు. కంపోస్టు (చివికిన పశువుల ఎరువు / వర్మీకంపోస్టు/ ఎండిన పేడ/ ఏదైనా ఇతర కంపోస్టు)+ కొబ్బరిపొట్టు సమపాళ్లలో కలిపి.. దానికి కొద్దిమొత్తంలో ఎర్రమట్టిని కలిపితే చాలు. కుండీలు, మడుల్లో ఆకుకూరలు, కూరగాయల సాగుకు మట్టి మిశ్రమం సిద్ధమైనట్లే. వేపపిండి ఉంటే కొంచెం కలిపితే ఇంకా మంచిది. కంపోస్టు టీ, వర్మీవాష్, జీవామృతం.. వంటివి వాడుకోవడం అవసరం.
 
 కుండీ అడుగున బెజ్జం మీద కుండ పెంకులు లేదా రాళ్లతో కప్పండి(ఈ బెజ్జం పూడిపోకుండా ఉంటేనే.. అదనపు నీరు బయటకుపోతుంది. కుండీలో నీరు నిలబడితే మొక్కకు నష్టం). ఆ తర్వాత కుండీ అడుగున అంగుళం మందాన ఎండు ఆకులు వేసి.. పైన మట్టి మిశ్రమం పోయండి. మట్టి నింపిన రోజే విత్తనాలు చల్లకండి. నీరు పోస్తూ ఒకటి, రెండు రోజులు కుండీ సాగుకు సిద్ధమయ్యాక.. విత్తనాలు చల్లండి లేదా మొక్కలు నాటండి.

No comments:

Post a Comment