Wednesday, September 3, 2014

కజ్జికాయలు


కావలసిన వస్తువులు: 
మైదా- 500గ్రా., నెయ్యి- 100గ్రా., ఉప్పు-చిటికెడు, చక్కెర-350గ్రా., కొబ్బరికాయలు-2, గసగసాలు-100గ్రా., పుట్నాల పప్పు- 150గ్రా., యాలకులు-5గ్రా., ఆయిల్‌-తగినంత
తయారు చేసే విధానం:
మైదావిండిని జల్లించి దీనికి ఉప్పు, నెయ్యి కలివి నీళ్ళతో పూరీల విండిలా కలపండి. ఒక బాణలిలో తురిమిన కొబ్బరికోరు వేసి సన్నని మంటమీద వేయిం చిన తర్వాత అందులో పుట్నాల పప్పుపొడి, గసాలు, చక్కెర కూడా వేసి బాగా వేయించి స్టౌ మీది నుంచి దింపి, యాలకుల పొడి కలివి పక్కన ఉంచండి. ముందుగా కలివి సిద్ధం చేసు కున్న మైదాను చిన్న, చిన్న ముద్దలుగా చేసుకొని వాటిని పూ రీల్లా వత్తి, దాని మధ్యలో బాణలి లో తయారు చేసిన కొబ్బరి తురుము, పుట్నాల పప్పు విండి మిశ్ర మాన్ని రెండు స్పూనులు వేసి పూరీని మధ్యకు మడవండి. అర్ధ చంద్రాకారంలో వస్తుంది. తర్వా త వాటి చివరలను తడి చేసి మడత మీద మడత వేసి వేళ్లతో గట్టిగా అదమండి. ఈ విధంగా చేయడం వల్ల మడత లోపలి మిశ్రమం బయటకు రాదు. ఇలా తయారయిన కజ్జికాయ లను కాగిన నూనెలో ఎర్రగా వేయించండి.

No comments:

Post a Comment