Wednesday, September 3, 2014

మెంతి పులావు


కావలసిన పదార్ధాలు:

బాసుమతి రైస్‌ - 1/2 కేజీ
మెంతికూర  - 8 కట్టలు
టమాటాలు  - 2
పెరుగు  - 1 కప్పు
జీర  - 10 గ్రా.
పచ్చిమిరపకాయలు - 4
పసుపు  - 1 టీ స్పూను
నెయ్యి  - 50 గ్రా.
ఉప్పు  - తగినంత


తయారు చేసే విధానం: 
బియ్యాన్ని శుభ్రం చేసుకొని కడిగి ఉంచుకోవాలి. అలాగే మెంతి కూరను కూడా ఆకు కోసి కడిగి ఉంచుకోవాలి. అరకిలో బియ్యం ఉడికే గిన్నెను స్టౌమీద పెట్టి నెయ్యి వేసి వేడి అయిన తర్వాత జీర వెయ్యాలి. అది వేగిన తర్వాత మెంతి కూరను వేసి రెండు నిమిషాలు వేయించి దానికి టమాటా ముక్కలు, పెరుగు, పసుపు చేర్చాలి. ఇవి కూడా కాస్త వేగిన తర్వాత తగినన్ని నీళ్లు పోసి అవి మరుగుతున్నప్పుడు బియ్యాన్ని పోసి కలపాలి. అప్పుడే ఉప్పును కూడా చేర్చాలి. బియ్యం 3/4 వంతు ఉడికిన తర్వాత మంటను తగ్గించి స్టౌవ్‌ను సిమ్‌ మీద ఉంచి పూర్తిగా ఉడకనివ్వాలి. వేడి వేడి మెంతి పులావ్‌ చాలా బాగుంటుంది.

No comments:

Post a Comment