Thursday, September 4, 2014

మినప పిండి వడియాలు 1

మినప పిండి వడియాలు

కావలసినవి: 

మినప్పప్పు - 250 గ్రా; పచ్చిమిర్చి - 10; అల్లం - చిన్నముక్క; జీలకర్ర - టేబుల్‌స్పూన్‌; ఉప్పు, ఇంగువ - తగినంత

తయారుచేసే విధానం:
మినప్పప్పును ముందురోజు నానబెట్టి మరుసటిరోజు ఉదయాన్నే గ్రైండర్‌లోవేసి మెత్తగా రుబ్బుకోవాలి. పచ్చిమిర్చి, జీలకర్ర అల్లం, ఉప్పు, మూడిటినీ మిక్సీలో వేసి పేస్ట్‌ చేసి, ఈ మిశ్రమాన్ని పిండిలో వేసి మరోమారు తిప్పాలి. ప్లాస్టిక్‌ పేపర్‌ మీద కాని, పల్చటి తడి వస్త్రం మీద కానీ ఈ పిండిని చిన్నచిన్న వడియాలుగా పెట్టాలి. ఎండలో నాలుగు రోజులు ఎండాక తీసేయాలి.

No comments:

Post a Comment