Wednesday, September 3, 2014

బాదుషాలు


కావలసిన వస్తువులు: 

మైదా - 500గ్రా., సోడా-1/2 టీ స్పూను, పెరుగు- గరిటెడు,చక్కెర- 250గ్రా
తయారు చేసే విధానం:
ముందుగా మైదాపిండి, వంట సోడాలను కలివి జల్లెడలో జల్లించి, అందులో గడ్డగా కాకుండా వేడిచేసి చల్లార్చిన నెయ్యి కలపాలి. మొత్తం విండిలో నెయ్యి అంతా కలిసేలా చూడాలి. తర్వాత అందులో పెరుగు కూడా కలివి, కొంచెం కొంచెం నీళ్లు చల్లుతూ గట్టి విండి ముద్దలా చేసి 10 నిమిషాలు నాననివ్వాలి. ఆ పిం డిని గులాబ్‌జామ్‌లంత సైజులో ముద్దలుగా చేయాలి. వాటిని రెండు అరచేతుల మధ్య గట్టిగా రుద్దుతూ, గుండ్రని ముద్దలుగా చేయడం వల్ల, గుల్లపడి బాదూ షాలా తయారు చేయడానికి వీలవుతుంది. ఇలా చేసిన విండి ముద్దల మధ్యలో రెండు పక్కలా బొటనవేలు చివ రతో నొక్కాలి. ఇపుడు సన్నని మంట మీదున్న ఒక బాణలిలో నెయ్యి పోసి, దానిలో పిండిముద్ద లను లేత బంగారురంగు వచ్చే వరకూ చేయించి, వాటిని ఒక ట్రేలో వరసగా అమర్చాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో చక్కెర వేసి, దానికి మూడు కప్పుల నీళ్లు కలిపి వేడిచేసి లేతపాకంలా తయార య్యాక దానిని అమర్చి ఉంచు కున్న బాదుషాల మీద పోస్తే పాకం అంతా ఇంకిపోతుంది. 

No comments:

Post a Comment