Wednesday, September 3, 2014

పల్లీల చట్నీ


కావలసిన పదార్ధాలు:
వేరుశనగ గుళ్లు	- 2 కప్పులు
కొబ్బరి పొడి		- 1 కప్పు
పుట్నాల పప్పు	- 1 కప్పు (వేయించినవి)
పచ్చిమిరపకాయలు	- 12
నూనె		- 2 టేబుల్‌  స్పూన్లు
జీలకర్ర, ఆవాలు	- 1 టేబుల్‌ స్పూను
ఎండుమిర్చి		- 3
పచ్చిశనగపప్పు	- 1 టేబుల్‌స్పూన్‌
మినపపప్పు		- 1 టేబుల్‌స్పూన్‌
వెల్లుల్లి		- 3 రెబ్బలు
కరివేపాకు		- 2 రెబ్బలు
చింతపండు		- కొద్దిగా
ఉప్పు		- సరిపడినంత


తయారు చేసే విధానం: 
వేరుశనగగుళ్లు వేయించి ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టకోవాలి. ఒక గిన్నెలో కొద్దిగా నూనెవేసి అందులో పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర వేయించి పెట్టకోవాలి. ఈ మొత్తానికి వేయించిన శనగగుళ్లు, పుట్నాల పప్పు, కొబ్బరిపొడి, ఉప్పు, చింతపండు వేసి మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో రెండు టేబుల్‌ స్పూన్ల నూనె వేసి దాన్లో ఎండుమిర్చి, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, దోరగా వేగాక కరివేపాకు వేయాలి. తరువాత ఆ పోపులో గ్రైండ్‌ చేసి ఉంచుకున్న పల్లీల చట్నీని వేయాలి. ఈ పల్లీల చట్నీని రాగిముద్దలో కలుపుకుని తింటే చాలా బాగుంటుంది. రాయలసీమ వాసులు రాగిముద్దలోకి ఈ పల్లీల చట్నీని ఇష్టంగా తింటారు.

No comments:

Post a Comment