కావలసిన పదార్థాలు...
మైదాపిండి : 80 గ్రా
కోడిగుడ్లు : మూడు
బేకింగ్ పౌడర్: పావు చెంచా
వేడినీరు : ఒక
వెనిల్లా ఎసెన్స్: కాసిన్ని చుక్కలు
చక్కెర : 85 గ్రా
జామ్ : 55 గ్రా
తయారీ విధానం...
మైదాపిండిని, బేకింగ్ పౌడర్ను జల్లెడలో జల్లించుకుని, రెండింటిని కలిపి వేడి నీరు పోసి ముద్దలా చేసుకోవాలి. కోడిగుడ్డు సొనను తీసుకుని బాగా కలియ బెట్టాలి. ఇందులో పంచదార వేసి బాగా కరిగేలా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలో పోసి నీరు మరుగు తున్న పాత్రలో ఉంచాలి, ఆవిరి వల్ల కోడిగు డ్డు సొన వేడెక్కి, సొనంతా చిక్కగా అయి గట్టి పడినట్లవు తుంది. దీనిని చెంచాతో కలిపి క్రీమ్లా చేయాలి.
ఈ క్రీమ్కు మైదా, బేకింగ్ పౌడర్ మిశ్రమా న్ని కూడా జత చేసి, కాస్త ఎసెన్స్ కలపాలి.
స్వస్రోల్ డబ్బా తీసు కుని దాని లోపలి గోడ లకు నెయ్యి గానీ, నూనె గానీ రాయాలి. దాంట్లో పైన కలిపి ఉంచుకున్న పదార్ధం అంతటిని పోయాలి.ఈ డబ్బాను ఓవెన్లో ఉంచి 200 సెంటీగ్రేడ్ వద్ద 15 నిమిషాలు ఉంచాలి.ఒక పేపర్ తీసుకుని పంచదార పోసి, దా నిపైన ఓవెన్లో ఉడికించిన పదార్థాన్ని వేడి చల్లారకుండా వేయాలి. పదార్ధం వేడిగా ఉన్న ప్పుడే స్పూన్ సాయంతో కేక్ మీద జామ్ రాయాలి. ఈ కే్ పై ఐసింగ్ షుగర్, కోకో మొ దలైన వాటితో అలం రించి సర్వ్ చేస్తే సరి..!
No comments:
Post a Comment