కావలసిన పదార్థాలు:
మినప్పప్పు - 1 కప్పు,
ఎండు మిర్చి - 5,
మిరియాలు - పావు టీ స్పూను,
శనగపప్పు - 1 కప్పు,
వెల్లుల్లి రేకలు - 5,
ఉప్పు - రుచికి సరిపడా.
తయారుచేసే విధానం:
ఒక పాత్రలో మినప్పప్పు, గింజలు తీసిన ఎండుమిర్చి, మిరియాలు, శనగపప్పు, వెల్లుల్లి వేసి, సరిపడా వేడి నీటిని చేర్చి 2 గంటలు నానబెట్టాలి.
తర్వాత మెత్తగా రుబ్బి సరిపడా ఉప్పుని కలపాలి. ఈ మిశ్రమాన్ని పల్చని పొడిబట్టపై వడియాల్లా పెట్టుకుని పెళపెళమనేలా ఎండబెట్టుకోవాలి.
మిగతా వడియాల్లా కాకుండా ఈ వడియాల రుచి కాస్త ఘాటుగా భిన్నంగా ఉంటుంది.
No comments:
Post a Comment