రింగులు
కావాల్సినపదార్థాలు:
మైదా - రెండున్నర కిలోలు,
వాము - 50 గ్రాములు,
డాల్డ - 50 గ్రాములు,
నూనె - రెండు కిలోలు,
నీళ్లు - 3లీటర్లు,
ఉప్పు - తగినన్ని.
తయారుచేయువిధానం:
ముందుగా నీటిని మరగబెట్టుకోవాలి. ఇందులో మైదా, వాము, డాల్డ, తగినంత ఉప్పు వేసి పిండిని కలుపుకోవాలి. ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఈ ఉండల్ని గచ్చుమీద పాముతూ సన్నగా వచ్చలా చేసుకోవాలి. దానిని గుండ్రగా చుట్టుకోవాలి. ఇప్పుడు స్టౌ మీద వెడల్పాటి కడాయి పెట్టి సరిపడా నూనె పోసి బాగా కాగాక ఈ రింగులని వేసి ఎరుపు రంగు వచ్చేవరకూ వేయించుకోవాలి.
No comments:
Post a Comment