Wednesday, June 18, 2014

వాంపూస



వాంపూస
కావాల్సినపదార్థాలు:
శెనగపిండి - రెండు కిలోలు,
వరిపిండి - 100గ్రాములు,
అల్లంవెల్లుల్లి, పచ్చిమిర్చి ముద్ద - 100గ్రాములు,
ఉప్పు - తగినంత,
నీళ్లు - తగినన్ని,
వాము - 50 గ్రాములు.

తయారుచేయు విధానం:
ముందుగా శెనగపిండిని ఉండలు లేకుండా మెత్తగా చేసుకోవాలి. తరువాత అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి మూడు కలిపి ఒక గ్లాసు రసం తీసుకుని వడపోయాలి. తరువాత ఒక గిన్నెలో మెత్తగా ఉన్న సీనాపిండి, వరిపిండి, వాము, అల్లంవెలుల్లి, పచ్చిమిర్చి రసం, తగినన్ని నీళ్లు పోసి పిండిని గట్టిగా కలుపుకోవాలి. ఒక వెడల్పాటి గిన్నె లేదా మూకుడు తీసుకుని నూనెని సమానంగా మరగబెట్టుకోవాలి. మరిగిన నూనెలో చిన్న రంధ్రాల బిళ్ల వేసిన జంతికల గొట్టంలో పిండిని పెట్టి నూనెలో వేయాలి.

No comments:

Post a Comment