|
|
|
|
- వేప పువ్వు చేదు కొరకు
- పచ్చి మామిడికాయ వగరు కొరకు
- చింతపండు పులుపు కొరకు
- మిరపకాయ కారం కొరకు
- బెల్లం మరియు అరటిపండు ముక్కలు తీపి కొరకు
- ఉప్పు ఉప్పదనం కొరకు
ఈ ఆరు రకాల రుచులు కలిపి చేసే మిశ్రమాన్ని ఉగాది పచ్చడి అంటారు. ఈ ఆరు రకాల రుచులు కూడా మనజీవితంలో ప్రతీసారి మనల్ని కదిలిస్తాయి. అవి బాధగా, ఆనందంగా, కోపంగా, భయంగా, ఆశ్చర్యంగా మన జీవితం ఉండాలని కోరుకుంటూ మనం దీనిని సాంప్రదాయబద్దంగా చేసుకుంటాము.
కావలసిన పదార్థాలు :
- బెల్లం - 2 టీస్పూన్స్
- చింతపండు - 1 1/2 టీస్పూన్
- మామిడికాయ ముక్కలు ( సన్నగా తరిగినటువంటివి )- 1 1/2 టీస్పూన్
- వేప పువ్వులు - 1 టీస్పూన్
- నీరు - 1 కప్పు
తయారుచేయు విదానం :
- ఒక కప్పులో నీరు తీసుకొని దానిలో చింతపండు వేసి 15 - 20 నిమిషాల పాటు నానబెట్టాలి.
- దాని నుండి గింజలు వేరు చేసి చింతపండు రసం తీయాలి.
- బెల్లాన్ని బాగా పొడిగా చేసి దానిలో కలియబెట్టాలి.
- తరువాత దానిలో మామిడికాయ ముక్కలు మరియు వేప పువ్వులు వేసి కలపాలి.
దానిని దేవునికి నైవేద్యంగా పెట్టి పూజ చేసుకొని తరువాత ప్రతిఒక్కరు తప్పని సరిగా తినవలసిన ప్రసాదము ఈ ఉగాది పచ్చడి. ఉగాది పండుగ నాడు మొట్టమొదటగా తినవలసినదే ఈ ఉగాదిపచ్చడి.
|
|
|
ఉగాది పండుగ నాడు మన ఆంద్రప్రదేశ్ లో తప్పనిసరిగా చేసుకొనే పిండివంటకం బొబ్బట్లు. దీని మీద నెయ్యివేసుకొనిగాని, పాలలో నంచుకొని గాని తింటారు.
కావలసిన పదార్థాలు :
బొబ్బట్టు లోపల పెట్టుటకు :
- పచ్చిపప్పు - 1 కప్పు
- పంచదార / బెల్లం - 1 1/2 కప్పు
- యాలుకలు - 8
పైన అద్దుటకు :
- మైదాపిండి - 1/2 కప్పు
- బియ్యపిండి - 1/2 కప్పు
- నూనె - 1 కప్పు
తయారుచేయు విధానం :
- పచ్చిపప్పును శుభ్రంగా కడిగి దానిని బాగా ఉడకపెట్టాలి.
- మైదాపిండి, బియ్యపిండిని కొంచెం ఉప్పు వేసి నీటితో కలపాలి.
- అ మిశ్రమంలో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి బాగా పిండి మిశ్రమము మృదువుగా వచ్చే విధంగా కలపాలి.
- ఆ మిశ్రమాన్ని 2 గంటలపాటు గాలి తగలకుండా ఉంచాలి.
- తరువాత ఉడికిన పప్పును తీసుకొని దానిలో ఎమైనా నీరు ఉంటే తీసివేసి దానిలో బెల్లం వేసి బాగా కలపాలి. (మిక్సీలో వేయవలెను).
- ఆ మిశ్రమాన్ని కొంచెం వేడి చేయవలెను.
- ఆ మిశ్రమం చల్లారిన తరువాత దానిని 10,12 గుండ్రంగా వుండలు చేసుకొనవలెను.
- మిదా పిండి మిశ్రమాన్ని తీసుకొని దానిని కూడా గుండ్రని వుండలుగ చేసుకొనవలెను.
- ఒక ప్లాస్టిక్ పేపర్ తీసుకొని దానిపై కొంచెం నూనె రాసి ఆ మైదా పిండి వుండను తీసుకొని చేతితో వెడల్పుగా చేయవలెను.అంచుల వద్ద మందంగాను, మద్యలో పలుచగాను వుండే విధంగా చేయవలెను.
- తరువాత దానిపై పప్పు బెల్లం కలిపిన మిశ్రమంతో చేసిన వుండను మద్యలో వుంచి మైదా పిండి అంచులతో దానిని కప్పివేయాలి.
- అదే విధంగా అన్ని వుండలను చేయాలి.
- తరువాత దానిని తీసుకొని చపాతిలాగా జాగ్రత్తగా వత్తాలి.
- దానిని పెనంపై నూనెతో కాని, నెయ్యితో కాని కాల్చుకోవాలి.
|
|
కావలసిన పదార్థాలు:
- బియ్యం - ఒకటిన్నర కప్పు
- చింతపండు - తగినంత
- పచ్చిమిరపకాయలు - 3(నిలువుగా తరగాలి)
- కరివేపాకు
- పచ్చిపప్పు - 1 టీస్పూన్
- వేరుశనగగుళ్ళు - 1 కప్పు
- జీడిపప్పు
- ఎండుమిరపకాయలు - 4
- పోపు గింజలు - 1/2 స్పూన్
- అల్లం మిశ్రమం
- నూనె - తగినంత
- పసుపు - 1టీస్పూన్
- ఇంగువ - తగినంత
- ఉప్పు - తగినంత
తయారు చేయు విధానము:
- మొట్టమొదట వండిన అన్నాన్ని ఒక పాత్రలోనికి తీసుకోవాలి.
- తరువాత పొయ్యిమీద ఒక బాండీలో నూనె పోసి వేడిచేసి దానిలో పోపు గింజలు వేసి వాటిని వేయించిన తరువాత దానిలో జీలకర్ర,వేరుశనగగుళ్ళు,జీడిపప్పు,పచ్చిపప్పు,అల్లం మిశ్రమం,పచ్చిమిరపకాయలు,ఎండుమిరపకాయలు మరియు కరివేపాకు వేసి బాగా వేయించాలి.ఆ మిశ్రమం మొత్తాన్ని అన్నం ఉన్న పాత్రలోనికి వేయాలి.
- మరల బాండీలో కొంచెం నూనె వేసి చింతపండు రసం వేయాలి,కొంచెం పసుపు,ఉప్పు,ఇంగువ వేసి బాగా కలియబెట్టి ఆ మిశ్రమాన్ని నూనె కలిసేవిదంగా తెరలనివ్వాలి.
- ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కూడా అన్నం లో పోయాలి.
- ఇప్పుడు ఆ పాత్రలో ఉన్న అన్నాన్ని బాగా కలియబెట్టాలి.కలిపిన తరువాత కొంచెం సమయం (చింతపండు మిశ్రమం పీల్చుకునేంత వారకు)మూతపెట్టాలి.
|
|
3/4 కప్పు పచ్చడి చేయుటకు కావలసిన పదార్థాలు :
- మామిడికాయ - 1
- కారం - 1 లేదా 2 స్పూన్స్
- పసుపు - 1/2 టీస్పూన్
- వెల్లుల్లిపాయ - 1
- కొత్తిమేర - 1 టీస్పూన్(తరిగినవి)
- ఉప్పు - తగినంత
పచ్చడికి పోపు(తిరగమాత) పెట్టుకోవాలనుకుంటే క్రింది వస్తువులు కూడా కావలెను:
- ఆవాలు - 1 టీస్పూన్
- జీలకర్ర - 1 టీస్పూన్
- ఇంగువ - కొంచెం (చిటెకెడు)
- కరివేపాకు - కొంచెం
తయారుచేయు విధానం :
- మామిడికాయను 1/2 అంగుళం ముక్కలుగా తరగాలి.
- ఒక గిన్నెలో వెల్లుల్లిపాయ, మామిడికాయ ముక్కలు, ఉప్పు, కారం, కొత్తిమేర వేసి బాగా కలియబెట్టాలి.
- ఆ మిశ్రమాన్ని తీసి విడిగా వేరే గిన్నెలో పెట్టుకోవాలి.
- ఇప్పుడు కొంత మిశ్రమం తీసుకొని దానికి పోపు పెట్టుకోవాలి.
- కొంచెం నూనెలో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి దానిలో కొంచెం ఇంగువ వేసి దానిని మామిడికాయ ముక్కల మిశ్రమంలో వేసి బాగా కలపాలి.
|
|
కావలసిన పదార్థాలు :
- వేరుశెనగపప్పులు - 4 టేబుల్ స్పూన్స్
- కరివేపాకు
- బియ్యం - 150 గ్రాములు
మిశ్రమం తయారుచేయుటకు :
- పసుపు - 1/2 టీస్పూన్
- ఆవాలు - 1 1/2 టీస్పూన్
- ఎండుమిరపకాయలు - 5
- తురిమిన మామిడి - 1 1/2 కప్పు
- కొబ్బరి తురిమినది - 4 టేబుల్ స్పూన్స్
- ఇంగువ - 1/2 టీస్పూన్
పోపుకు కావల్సిన పదార్థాలు :
- పచ్చిపప్పు - 1 టేబుల్ స్పూన్
- ఎండుమెరపకాయ - 1
- ఆవాలు - 1 టీస్పూన్
- కరివేపాకు
- నూనె - 3 టేబుల్ స్పూన్
తయారుచేయు విధానం :
- మొట్టమొదటగా అన్నాన్ని వండుకొని దానిని చల్లరపెట్టుకోవాలి.
- మిశ్రమం చేయుట కొరకు అవాలు, ఇంగువ, ఎండుమిరపకాయలు, పసుపు మరియు తురిమిన కొబ్బరికి తీసుకొని బాగా కలపాలి.
- తరువాత దానిలో సగం తురిమిన మామిడిని వేయాలి
- దీని అంతటిని బాగా మిశ్రమంగా చేయాలి.
- పోపు పెట్టుటకు ఒకపాత్రలో కొంచెం నూనె వేసి వేడిచేయవలెను.
- దానిలో పచ్చిపప్పు, ఆవాలు, మిరపాక, కరివేపాకు వేయవలెను.
- అవి బాగా వేగిన తరువాత దానిలో వేరుశెనగపప్పు వేసి వేయించవలెను.
- అది బంగారు రంగులోకి వచ్చే విధంగా వేయించిన తరువాత మిగిలిన మామిడి తురుమును కూడా వేసి వేయించవలెను.
- దానిని కొంచెం తక్కువ మంటపై వేడి చేయవలెను
- దానిలో మనము తయారు చేసిన మిశ్రమాన్ని కలిపి దానిలో ఉన్న పచ్చి వాసన పోయేవరకు దానిని వేయించవలెను.
- ఆ మిశ్రమం మొత్తాన్ని ఒక పాత్రలో తీసుకొని ఉంచండి.
- చల్లారబెట్టిన అన్నాన్ని తీసుకొని దానిలో తగినంత ఉప్పు మరియు కరివేపాకులను కలిపాలి.
- మిశ్రమాన్ని తీసుకొని ఆ అన్నంలో వేసి కలుపుకోవాలి.
|
|
కావలసిన పదార్థాలు :
- జీలకర్ర - 1/2 టీస్పూన్
- నూనె - 1 టేబుల్ స్పూన్
- బెల్లం - 1 టేబుల్ స్పూన్
- ఎండు మెరపకాయలు - 6
- ఉప్పు - తగినంత
- తురిమిన కొబ్బరి - 1/2 కప్పు
- ఉల్లిపాయ - 2 తరిగినవి
- మామిడికాయలు - 250 గ్రాములు
- వెల్లుల్లి రెబ్బలు - 6
- కొత్తిమేర - 1టీస్పూన్
- పసుపు - 1/2 టీస్పూన్
- అల్లం - 1 ముక్క
తయారుచేయు విధానం :
- మామిడికాయల తొక్కు తీసుకొనవలెను.
- లోపల ఉన్న టెంకెను తీసివేసి చిన్న చిన్న ముక్కలుగా చేయవలెను.
- ఆ ముక్కల్ని కడిగి శుభ్రంగా చేసుకొనవలెను.
- తరువాత కొబ్బరి, మిరపకాయలు, అల్లం, వెల్లుల్లి, కొత్తిమేర మరియు జీలకర్ర తీసుకొని బాగా మిశ్రమం చేసుకోవలెను.
- ఒక పాత్రలో నూనె తీసుకొని దానిలో ఉల్లిపాయల ముక్కలు వేసి బాగా వేయించవలెను.
- తరువాత దానిలో మనము తయారుచేసిన మిశ్రమాన్ని వేసి బాగా కలిపి వేయించవలెను.
- దానిలో మామిడికాయ ముక్కల్ని మరియు బెల్లాన్ని వేసి బాగా కలిపి ఒకగ్లాసు నీరు పోయాలి.
- దానిలో తగినంత ఉప్పు వేసుకొని తక్కువ మంటపై వుంచి కూరను తయారుచేసుకోవాలి.
|
No comments:
Post a Comment