కావలసిన పదార్థాలు:
ఎండుమిర్చి - 10
కరివేపాకు - 1 cup
చింతపండు - 10 రెబ్బలు
ధనియాలు - 1/2 cup
ఛాయా మినప్పప్పు - 1/2 cup
వెల్లుల్లి - 10 రెబ్బలు
పసుపు - 1/4 టీ స్పూన్
ఉప్పు - 1.5 లేదా 2 టీ స్పూన్స్
జీలకర్ర - 1 టీ స్పూన్
నూనె - 4 టీ స్పూన్స్
తయారు చేసే పద్దతి:
- మూకుడులో నూనె వేసి కాగనిచ్చి sim లో పెట్టాలి.
- అందులో ఎండుమిర్చి వేయాలి. రెండు నిమిషాలకి దోరగా వేగుతాయి.
- దోరగా వేగాక వాటిని నూనె లో నుంచి తీసి పక్కన పెట్టుకోవాలి.
- తరువాత నూనెలో ఛాయమినప్పప్పు వేసి దోరగా వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి.
- మిగిలిన నూనె లో ధనియాలు వేసి వేయించాలి.
- కొంచం ఎర్రగా వేగిన తరువాత కడిగి ఆరబెట్టిన కరివేపాకు వేసి వేయించి stove off చేయాలి.
- వాటిని మూకుడులో అలాగే ఉంచి చల్లరనిస్తే కరివేపాకు గట్టిపడుతుంది.
- చింతపండు, వెల్లుల్లి తప్ప మిగిలినవి అన్ని మెత్తగా mixy పట్టాలి.
- అందులో చింతపండు, వెల్లుల్లి వేసి తరువాత mixy పట్టాలి.
- mixy పట్టాక పులుపు, ఉప్పు సరిపోయిందో లేదో సరిచూసుకోవాలి.
- mixy లో చింతపండు వేసే ముందు చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి.
- నూనె లో నుంచి అన్ని తీయడానికి బెజ్జాల గరిట వాడితే నూనె రాకుండా ఉంటుంది.
- ఈ పొడుము ఇడ్లికి, వేడి అన్నంలోకి, మజ్జిగ లోకి చాలా రుచిగా ఉంటుంది.
No comments:
Post a Comment