Sunday, June 8, 2014

సమ్మర్ స్పెషల్ మ్యాంగో ఫిర్నీ


సమ్మర్ స్పెషల్ మ్యాంగో ఫిర్నీ



కావల్సిన పదార్థాలు: 
బియ్యం : 2cups 
పాలు: 1cup 
మామిడి పండు గుజ్జు: 1cup 
బాదాం: 1tsp 
పిస్తా పప్పు: 1tsp 
యాలకులు పొడి: చిటికెడు 
పంచదార: 1cup 

తయారు చేయు విధానం: 
1. ముందుగా బియ్యాన్ని కడిగి నానబెట్టుకోవాలి. కొద్ది సేపటి తర్వాత నీళ్ళు లేకుండా వడకట్టి కాసేపు ఆరబెట్టాలి. 
2. తడి పూర్తిగా ఆరిన తర్వాత మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి . 
3. తర్వాత స్టౌమీద మందపాటి పాన్ పెట్టి అందులో పాలు పోసి బాగా కాగనివ్వాలి. పాలు బాగా మరిగే పటప్పుడు పంచదార కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. 
4. అంతలోపు, ఒక గిన్నెకొద్దిగా నీళ్ళు పోసి అందులో బియ్యం పిండిని పోసి కలుపుతూ ఉడకనివ్వాలి. 
5. బియ్యంపిండి ఉడకుతూ చిక్కబడే సమయంలో మామిడి పండు గుజ్జును కూడా అందులో వేసి బాగా మిక్స్ చేస్తే ఇంకాస్తా చిక్కబడ్డాక అందులో యాలకల పొడి వేయాలి. 
6. చల్లారక ఈ మిశ్రమాన్ని మరో పాత్రలోకి తీసుకుని బాదం పప్పు, పిస్తాపప్పుతో అలంకరించి సర్వ్ చేయాలి. అంతే సమ్మర్ స్పెషల్ మ్యాంగో ఫిర్నీ రెడీ.

No comments:

Post a Comment