తయారీకి కావలసిన పదార్ధాలు:
ఉసిరి పండ్లు,
పంచదార,
నీరు,
నిమ్మ ఉప్పు
తయారీ: కడిగిన ఉసిరి పండ్లను పలచటి బట్టలో ఉంచి మరిగే నీటిలో మెత్తబడేవరకు ఉంచాలి.
తర్వాత మూటలోని పండ్లను బయటకి తీసి ప్రతి పండును సూదులతో రంధ్రాలు చేసి ఈ పండ్లను మూడుపాళ్లు, పంచదార, ఏడుపాళ్లు నీరు 30 శాతంగల సిరప్లో మునిగేటట్టు ఒక రాత్రి ఉంచాలి.
మరునాడు పండ్లను బయటకి తీసి సిరప్కు మరికొంత పంచదార చేర్చి తిరిగి పండ్లను సిరప్లోకి మా ర్చాలి. ఈవిధంగా వారంరోజులు చేసిన తర్వాత సిరప్ 70శాతం వరకు చేరుకుంటుంది.
అప్పుడు సిరప్కు ఒక టీ స్పూన్ నిమ్మ ఉప్పు కలిపి శుభ్రంగా కడిగిన గాజుజాడీలలో ఉసిరిపండ్లను సిరప్తో పాటు నింపి నిల్వ చేసుకోవాలి,
గుజ్జు శాతం ఎక్కువగా ఉండి, గింజభాగం తక్కువగా ఉన్న బనారసి, కాంచన్, క్రిష రకాలతో యీ మురబ్బా చేసుకుని ప్రతిరోజూ ఉదయం సేవిస్తే చాల మంచిది.
No comments:
Post a Comment