Sunday, July 6, 2014

మిక్సడ్‌ ఫ్రూట్‌ జామ్‌

కావలసినవి
యాపిల్స్‌- కేజీబొప్పాయి పండు, ద్రాక్ష- అరకేజీ చొప్పునఅరటి పండ్లు -నాలుగుపంచదార- రెండు కేజీలుసిట్రిక్‌ ఆసిడ్‌- నాలుగు స్పూన్లు
పెక్టిన్‌- ఒక స్పూన్‌
తయారీ: 
యాపిల్‌. అరటి, బొప్పాయి పండ్లు శుభ్రంగా కడిగి పొడివస్త్రంతో తుడవాలి. తరువాత చెక్కు తీసి ముక్కలుగా కోయాలి. ఈ పండ్ల ముక్కలు, ద్రాక్షపండ్లు ఓ పాత్రలోకి తీసుకుని సరిపడ నీళ్లు పోసి, సన్నని మంటపై ఉంచాలి. నీళ్లు ఆవిరై పండ్ల ముక్కలు గుజ్జుగా అయాక పంచదార చేర్చి సన్నని మంటపై ఉంచాలి. అరకప్పు నీటిలో సిట్రిక్‌ యాసిడ్‌ పోసి కలిపి మరి కాసిని నీరు పెక్టిన్‌ మిశ్రమంలో వేసి కలపాలి. ఎరుపు లేదా పసుపు రంగులో ఉండాలనుకునేవారు ఆ ఎసెన్సును కొద్దిగా వాడాలి. మిక్స్‌డ్‌ ఫ్రూట్‌ జామ్‌ సిద్ధమైనట్టే. చల్లారాక గారిచొరని డబ్బాలోకి తీసుకుని గట్టిగా మూతపెడితే సరిపోతుంది.

No comments:

Post a Comment