కావలసిన పదార్థాలు:
పుచ్చకాయ ముక్కలు: 2cups
మిరియాల పొడి: 2tsp
ఉప్పు: చిటికెడు
తేనే: 1tsp
పంచదార: 1tbsp
పుదీనా ఆకులు : 3
ఐస్ ముక్కలు: సరిపడినన్ని (ఇష్టమైతే వేసుకోవచ్చు)
తయారు చేయు విధానం:
1. మొదటగా మందాపాటి కవచం నుండి పుచ్చకాయ ముక్కలను వేరు చేసి కట్ చేసి పెట్టుకోవాలి.
2. తర్వాత మిక్సీలో పుచ్చముక్కలు, పంచదార, మిరియాల పొడి, పుదీనా ఆకులు, ఉప్పు గ్రైండ్ చెయ్యాలి.
3. దీన్ని అరగంట ఫ్రీజర్ లో పెట్టి తర్వాత బయటకు తీసి అందులో తేనె, కావలసినంత ఐస్ ముక్కలు వేసి, పుదీనా ఆకుతో గార్నిష్ గా అలంకరించి సర్వ్ చేయండి. ఎంత ఎండలో వచ్చిన వారైనా ఈ పానీయం తాగితే కూల్ కూల్ అయిపోతారు.
No comments:
Post a Comment