Monday, July 7, 2014

పానీ పూరి

Picture
కావలసిన పదార్థాలు
ఉప్మా రవ్వ - అరకప్పు, 

మైదా - అర టేబుల్‌ స్పూన్‌
పుదీనా - 2 కట్టలు, 

ధనియాలు - 1 టేబుల్‌ స్పూన్‌
చింతపండు - నిమ్మకాయంత, 

అల్లం - 25 గ్రాములు, 
నూనె - సరిపడా
ఉప్పు - తగినంత, 

పచ్చిమిర్చి - 4, 
జీలకర్ర పొడి - 1టీ స్పూన్‌
బ్లాక్‌ సాల్ట్‌ - ఒకటిన్నర టీ స్పూన్‌, 

మొలకలు - అరకప్పు, 
బూందీ - అరకప్పు

తయారీ విధానం
  •  బొంబాయిరవ్వలో మైదా, ఉప్పు వేసి చపాతీ పిండిలా కలిపి పావుగంట నాననివ్వాలి.
  • తర్వాత ఈ పిండిని బాగా చిన్న ఉండలు చేసుకుని పూరీల్లా వత్తి నూనెలో వేయించుకోవాలి. ఇప్పుడు పూరీలు తయారైనట్టే.
  • వీటిని గాలి చేరని డబ్బాలో వేసుకోవాలి.
  • చింతపండులో నీళ్లుపోసి గంట నానబెట్టాలి.
  • ధనియాలను పొడి చేసుకోవాలి.
  • పుదీనా, పచ్చిమిర్చి, అల్లం నూరుకోవాలి.
  • చింతపండు రసం తీసి దానికి మరికొన్ని నీళ్లు కలపాలి.
  • అందులో పుదీనా పచ్చిమిర్చి అల్లం పేస్ట్‌, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పు, బ్లాక్‌సాల్ట్‌ కలపాలి.
  • ఈ మిశ్రమాన్ని రెండు, మూడు గంటలు కదపకుండా ఉంచాలి.

No comments:

Post a Comment