కావలసిన పదార్ధాలు:
రెండున్నర కిలోల బొప్పాయి పండ్లు,
12 అరటిపండ్లు,
250 గ్రాముల ద్రాక్షపండ్లు,
ఆరు సపోటా పండ్లు,
మూడు కిలోల చ క్కెర,
అయిదు చెంచాల నిమ్మఉప్పు,
2 చెంచాల మిక్స్డ్ ఫ్రూట్ జామ్ ఎసెన్స్.
తయారీ:
బాగా పండిన బొప్పాయి పండ్లను మధ్యకి కోసి గింజలు తీసివేసిన పిదప సన్నగా తరిగి ఒక గిన్నెలో వేయాలి. తర్వాత బాగా పండిన అరటిపండ్లను తొక్కలు తీసివేసి వేరొక గిన్నెలో వేసి చేతితో మెత్తగా చేయాలి.
ఆ తర్వాత సపోటా పండ్ల పైపొర మధ్యలోని గింజలు తీసివేసి బొప్పాయి గుజ్జులో వేసి, చేతితో మెత్తగా చేయాలి. తర్వాత బాగా పండిన గింజలు లేని ద్రాక్షపండ్లను వేరొక గిన్నెలో వేసి మెత్తగా చేయాలి.
ఈ నాలుగు రకాల పండ్ల గుజ్జును ఒక గిన్నెలో వేసి కలిపి మెత్తగా చేయాలి.
తర్వాత ఈ పండ్ల గుజ్జును సన్ననిసెగలో వేడిచేయాలి. పదినిమిషాల తర్వాత దానిలో చక్కెర వేసి కలపాలి,
ఈ మిశ్రమం ఉడికిన కొద్దిసేపటికి నిమ్మ ఉప్పు వేయాలి.
ఈ మిశ్రమం పాకం వచ్చిన తర్వాత ఎస్సెన్స్ కలిపి గోరు వెచ్చగా ఉన్నప్పుడే వెడల్పు మూతగల సీసాలో నింపి మూతపెట్టి నిల్వ చేయాలి.
దీనిపై వాడే సీసాలను ముందుగానే బాగా శుభ్రపరిచి ఆరబెట్టి ఉంచుకోవాలి.
No comments:
Post a Comment