కావలసిన పదార్థాలు :
మైదా పిండి... పావు కేజీ
డాల్డా లేక మార్గరిన్... 150 గ్రాములు
బేకింగ్ పౌడర్... అర టీస్పూన్
పంచదార... 50 గ్రాములు
మిక్స్డ్ ఫ్రూట్ జామ్... 75 గ్రాములు
ఐస్ వాటర్... తగినంత
తయారీ విధానం :
మైదా పిండి శుభ్రం చేసుకుని, బేకింగ్ పౌడర్ కలపాలి. దీనికి డాల్డా లేక మార్గరిన్ను కలిపి ఐస్ వాటర్తో ముద్దగా చేసుకోవాలి. ఈ పిండిని చపాతీల్లాగా చేసుకుని, ఒక్కో చెపాతీని రెండుగా కట్ చేసి, మడతవేసి 1/4 అంగుళాల మందంకలిగి ఉండేలా పూరీల్లాగా వత్తుకోవాలి. వీటిని చక్కెరలో దొర్లించి పెట్టుకోవాలి.
ఇడ్లీ కుక్కర్ ప్లేట్ల గుంతల్లో నెయ్యి రుద్ది, పైన తయారు చేసుకున్న పూరీలను గుండ్రంగా కోసి పైన ఒకటి, కింద ఒకటి మధ్యలో జామ్ పెట్టి అమర్చాలి. ఇప్పుడు ఓవెన్లో 40 డిగ్రీల ఫారన్ హీట్ వేడి వద్ద పదిహేను నిమిషాలపాటు ఉడికించి తీసేయాలి. అంతే జామ్ బిస్కెట్ రెడీ. పిల్లలు వీటిని బాగా ఇష్టంగా తింటారు. మీరూ ప్రయత్నిస్తారు కదూ...!
No comments:
Post a Comment