కావల్సి పదార్థాలు:
రైస్: 3cups( అన్నం పొడి పొడిగా వండుకొని పక్కన పెట్టుకోవాలి)
పచ్చిమామిడికాయ తురుము: 11/2 cup(పొట్టు తీసేసి సన్నగా తురుముకోవాలి)
వేరుశెనగలు: 5-6tbsp( వేగించినవి)
జీడిపప్పు :2tbsp(రోస్ట్ చేసుకోవాలి)
ఉప్పు: రుచికి
సరిపడా పోపు కోసం:
నూనె: 1 1/2tbsp
ఆవాలు: 1tbsp
శెనగపప్పు: 1tbsp
ఉద్దిపప్పు: tbsp
ఎండు మిర్చి: 3-4
పచ్చి మిర్చి: 6-8(మద్యలోకి కట్ చీలికగా కట్ చేసి పెట్టుకోవాలి)
తురిమిన అల్లం: 1tsp
ఇంగువ: 1/4tsp
పసుపు: 1/4 tsp
కరివేపాకు: రెండు రెమ్మలు
తయారుచేయు విధానం :
1. ముందుగా మందపాటి పాన్ స్టౌ మీద పెట్టి అందులో నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు వేయాలి.
2. ఆవాలు చిటపలాడిన తరవ్ాత అందులో శెనగపప్పు, ఉద్దిబాళ్ళు, వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించుకోవాలి. వెంటవెంటనే అందులో పచ్చిమిర్చి, ఎండు మిర్చి ముక్కలు, అల్లం తురుము, కరివేపాకు, అల్లం, పసుపు మరియు ఇంగువ వేసి, కొన్ని సెకండ్లు తక్కువ మంట మీద వేగించుకోవాలి.
3. పోపు వేగిన తర్వాత అందులో పచ్చిమామిడి తురుము వేసి మరోకొన్ని నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
4. తర్వాత అందులోనే రోస్ట్ చేసి పెట్టుకొన్నవేరుశెనగలు మరియు జీడిపప్పు వేసి మిక్స్ చేసి స్టౌ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
5. ఇప్పుడు ముందుగా వండి పెట్టుకొన్న అన్నంను పోపులో వేసి, ఉప్పు చిలకరించి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి. ఒకసారి కలిపిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో తెలుకొని సరిపడా వేసి మిక్స్ చేసి అడ్జెస్ట్ చేసుకోవాలి.
6. అంతే మామిడికాయ పులిహోర రెడీ. ఉగాది స్పెషల్ గా మామిడికాయ పులిహోరతో పాటు సైడ్ గా వడియాలు, పెరుగు లేదా పచ్చడితో సర్వ్ చేస్తే చాలా రుచికరంగా ఉంటుంది.
No comments:
Post a Comment